అల్లరి నరేష్ మరో డిఫరెంట్ మూవీ..?

అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ ట్రెండ్ మారింది. అతని కథలు మారలేదు. దీంతో కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూశాడు. అలాగని అతను కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేయలేదు. మధ్యలో గమ్యం, ప్రాణం, నేను వంటి సీరియస్ మూవీస్ కూడా చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా చేసిన నాంది సినిమాకు అద్భుతమైన నటన చూపించి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. నాందిలో అతని ఇమే్జ తాలూకూ ఫ్రేమ్ ఒక్కటి కూడా కనిపించకపోవడం అతని ప్రతిభకు తార్కాణం. ఇప్పుడు మరోసారి అలాంటి సీరియస్ కంటెంట్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట నరేష్. నాంది తర్వాత నరేష్ ఏ కొత్త సినిమాకూ కమిట్ కాలేదు. అంతకు ముందే ఒప్పుకున్న సభకు నమస్కారం అనే సినిమా ఆ చిత్ర నిర్మాత మహేష్ కోనేరు చనిపోవడంతో ఆగిపోయింద.
ఇక లేటెస్ట్ గా నరేష్ వద్దకు మర వైవిధ్యమైన కథ వచ్చిందట. ఈ కథ రచయిత అబ్బూరి రవి ద్వారా నరేష్ వరకూ వచ్ిచందని టాక్. అయితే సదరు కథ చెప్పింది మాత్రం తెలుగువాడు కాదు. ఓ తమిళ్ డైరెక్టర్. అతనికీ కొత్త సినిమానే అంటున్నారు. అయినా నరేష్ కు అతను చెప్పిన కథ బాగా నచ్చడంతో ఓకే చేశాడు అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఏ బ్యానర్ లో నిర్మిస్తారు.. ఎప్పుడు మొదలవుతుంది.. వంటి విషయాలన్నీ త్వరలోనే ప్రకటించబోతున్నారు. మరి ఈ తమిళ దర్శకుడి కథ నరేష్ కు మంచి విజయాన్ని అందిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts