మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ భారీ క్రేజీ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తే… చరణ్ సరసన పూజా హేగ్డే నటించింది. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆచార్య చిత్రం కరోనా కారణంగా బాగా ఆలస్యం అయ్యింది. చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే… దేవాలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్న అవినీతిపరుల భరతం పట్టే నక్సలైట్లుగా ఈ సినిమాలో చిరంజీవి – చరణ్ కనిపించనున్నారు. అయితే… ఈ సినిమా రన్ టైమ్ 3 గంటలకి పైగా వచ్చిందట. 3 గంటల నిడివి అయితే ఎక్కువ అవుతుందా.? ప్రేక్షకులు బోర్ ఫీలవుతారా.? అనే విషయంలో చిరు, కొరటాల తర్జనభర్జనలు పడుతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఓ పావుగంట నిడివిని తగ్గిస్తే ఎలా ఉంటుందా అనే విషయం గురించి చిరు, కొరటాల ఆలోచిస్తున్నారట.
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆచార్య రన్ టైమ్ 3 గంటలా అని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఆచార్య రన్ టైమ్ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ లో ముంబాయిలో బిజీగా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆచార్య రన్ టైమ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారట. మరి.. ఆచార్య రన్ టైమ్ 3 గంటలు ఉంటుందో.. తగ్గిస్తారో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.