ఫ్యామిలీ స్టార్ మూవీలో రష్మిక గెస్ట్ అపీరియన్స్..?

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి చేస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ మూవీలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతుందట. ఇప్పటికే ‘గీత గోవిందం’ సినిమా కోసం విజయ్ దేవరకొండ, పరశురామ్, రష్మిక మందన్న కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ‘డియర్ కామ్రేడ్’ మూవీలో నటించారు. మళ్ళీ ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ కోసం కలవబోతున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Related Posts