చిరంజీవిపై కేసు పెడతానంటోన్న మన్సూర్

తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ – హీరోయిన్ త్రిష వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమధ్య ఓ ప్రెస్ మీట్ లో త్రిష పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మన్సూర్. దానికి త్రిష తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఇకపై మన్సూర్ తో సినిమాల్లో నటించేది లేదంటూ కరాఖండిగా చెప్పింది. త్రిషకి మద్దతుగా చిరంజీవి, ఖుష్బూ వంటి వారు సోషల్ మీడియా వేదికగా మన్సూర్ ఆలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు.

అయితే.. ఇటీవల ఈ విషయంలో త్రిషకు.. మన్సూర్ ఆలీ ఖాన్ క్షమాపణలు చెప్పండంతో ఈ వివాదం సద్దుమణిగిందనుకున్నారు. కానీ.. ఈ వివాదం మరో కొత్త రూపు సంతరించుకుంటోంది. లేటెస్ట్ గా మన్సూర్ మరోసారి ఈ వివాదంపై స్పందించాడు. తాను చెప్పిన వీడియోని సరిగ్గా చూపించకుండా.. ఎడిట్ చేసి చూపించడం ద్వారానే ఇంత రాద్దాంతం జరిగిందని.. అయితే.. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా త్రిష, చిరంజీవి, ఖుష్బూ వంటి వారు తనపై ఆరోపణలు చేశారని.. వారిపై తాను సోమవారం కోర్టులో కేసు వేయబోతున్నట్టు తెలిపాడు. చూడాలి.. ఈ వివాదం ఇంకెంత ముందుకెళుతుందో.

Related Posts