సందీప్ రెడ్డి వంగని ఆర్జీవీతో పోల్చిన రాజమౌళి..

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాని పోల్చారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. హైదరాబాద్ లో తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మహేశ్ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డిపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త దర్శకులు వస్తున్నారు..సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రమే సినిమాని ఇలాగే తీయాలనే ఫార్ములాను పక్కనపెట్టి ఓ కొత్త స్టైల్ లో తీసి సంచలనం సృష్ఠిస్తున్నారు. అలాంటి దర్శకులు మాతరంలో రాం గోపాల్ వర్మ అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అని..ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు బ్ర‌ద‌ర్.. అంటూ రాజమౌళి పొగిడారు. ఇదే సమయంలో హీరో రన్‌బీర్ కపూర్ తో ఒకేసారి నా సినిమాలో సందీప్ సినిమాలో నటించాల్సి వస్తే ఏది ఎంచుకుంటారు అని అడగగా..ఆయన చాలా తెలివిగా రెండు షిఫ్టుల్లో ఇద్దరి సినిమాలు చేస్తానని సమాధానం చెప్పారు. ఈ సమాధానానికి సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. కాగా, ‘యానిమల్’ చిత్రాన్ని డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Related Posts