లాజిక్కులు, డ్రామా లేదని ‘యానిమల్’ సినిమాను రిజెక్ట్ చేయొచ్చు: సందీప్ రెడ్డి వంగ

‘యానిమల్’ కథ చెప్పినప్పుడు ఏ హీరో అయినా చాలా ఈజీగా రిజెక్ట్ చేస్తారు. కథలో లాజిక్కులు లేవు, మంచి డ్రామా లేదని అంటారు. ఇవేవి రన్‌బీర్ నాతో అనలేదు. నేను చెప్పిన కథను, నన్ను నమ్మాడు అని అన్నారు ‘యానిమల్’ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించగా, బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సందీప్ రెడ్డి వంగ..’సినిమా లెంగ్త్ గురించి ఆలోచించకండి ప్రతీ సీన్ ఎంజాయ్ చేస్తారు’ అని ఎంతో నమ్మకంగా చెప్పారు. ‘నేను ఒక మంచి తండ్రీకొడుకుల కథ చెప్పానని అనుకుంటున్నాను. ‘యానిమల్’ సినిమా అందరికీ నచ్చుతుంది. డిసెంబర్ 1న థియేటర్స్ లో కలుద్దాం’.. అని చెప్పారు. ఇదే ఈవెంట్ లో గెస్టులుగా విచ్చేసిన మహేశ్ బాబు, రాజమౌళి సినిమాకి ఇచ్చిన హైప్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. చూడాలి మరి యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని సృష్ఠిస్తుందో.

Related Posts