మెగా బ్రదర్స్ అనుబంధం

మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తే ముందుగా గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు చిరంజీవి. కేవలం తాను మాత్రమే కాకుండా.. తన తమ్ముళ్లను కూడా చిత్ర పరిశ్రమలో ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత చిరంజీవిది. ఇక.. రెండో తరంలోనూ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మెగా బ్రదర్స్ బాండింగ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెగా ఫ్యామిలీలో ఏ కార్యక్రమం జరిగినా కుటుంబ సభ్యులంతా ఒక చోట కలుసుకుంటూ అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలుస్తుంటారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య వివాహం సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట సందడి చేసింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అయితే.. వీటిలో మెగా బ్రదర్స్ ముగ్గురూ దిగిన ఫోటో మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి.

తన అన్నాతమ్ముడుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు నాగబాబు. తమ మధ్య బేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ… తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని.. తమది విడదీయలేని అనుబంధం అని.. ఈ ఫోటోకి నాగబాబు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Related Posts