లావణ్య విషయంలో ఆ రెండూ నిజమయ్యాయి

‘అందాల రాక్షసి‘తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత పలు సినిమాలలో కథానాయికగా అలరించిన లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు మెగా ఇంట కోడలు అయ్యింది. అయితే.. లావణ్య త్రిపాఠి జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిన రెండు సంఘటలు ఇప్పుడు ఆమె జీవితంలో నిజమయ్యాయి.

అప్పట్లో ‘చావు కబురు చల్లగా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. ‘ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని అన్నారు. అది ఇప్పుడు నిజమైంది. పైగా.. తమ మెగా కుటంబానికి సంబంధించిన అబ్బాయినే వివాహం చేసుకుంది లావణ్య.

ఇక.. లావణ్య తొలిచిత్రం ‘అందాలరాక్షసి‘లో ఓ డైలాగ్ ఉంది. అందులోని ఓ సన్నివేశంలో కొంతమంది పిల్లలు ‘మిథున అక్కా.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారంటా కదా అంటే.. అవునంటుంది. పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా? అంటూ లావణ్యను అడుగుతారు.

అందుకు లావణ్య కూడా అవునని చెబుతుంది. ఆ తర్వాత పిల్లలంతా ‘గ్యాంగ్ లీడర్ కూడా వస్తున్నాడంటూ అల్లరి చేస్తూ వెళ్లిపోతారు. ‘అందాలరాక్షసి‘ సినిమాలో డైరెక్టర్ హనురాఘవపూడి పెట్టిన ఈ సన్నివేశం కూడా ఇప్పుడు లావణ్య జీవితంలో నిజమైంది. ఇటలీలో జరిగిన వరుణ్-లావణ్య వివాహంలో మెగాస్టార్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ‘అందాలరాక్షసి‘ సినిమాలోని ఈ సన్నివేశం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Related Posts