‘గేమ్ ఛేంజర్’.. యాక్షన్ లో ఇరగదీస్తున్న చరణ్

ఈపాటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకోవాల్సిన ‘గేమ్ ఛేంజర్‘ నత్త నడకన సాగుతోంది. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2‘తో బిజీ అవ్వడమే. ఒకవైపు ‘గేమ్ ఛేంజర్‘.. మరోవైపు ‘ఇండియన్ 2‘ చిత్రాలను ప్యారలల్ గా పూర్తిచేస్తున్నాడు గ్రేట్ డైరెక్టర్ శంకర్. ఇప్పటికే ‘ఇండియన్ 2‘ ఓ కొలిక్కి రావడంతో ఇకపై పూర్తి ఫోకస్ అంతా ‘గేమ్ ఛేంజర్’ పైనే పెట్టనున్నాడట. ఇక.. శంకర్ సినిమాలంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా అలాంటి ఓ విజువల్ వండర్ గా రూపొందుతోందట.

యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించడంలో శంకర్ ది ప్రత్యేక శైలి. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేని సమయంలోనే తన సినిమాల్లో హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలను రూపొందించి వెండితెరపై మాయాజాలం చేశాడు. సరైన హీరో దొరకాలే కానీ శంకర్ చెలరేగిపోతాడు. ఇప్పుడు అలాంటి హీరో క్వాలిటీస్ ఉన్న చరణ్ దొరకడంతో ‘గేమ్ ఛేంజర్’లో యాక్షన్ ఓ రేంజులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’తో మరోసారి యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా తన విజన్ ను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నాడట.

లేటెస్ట్ గా ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి భారీ యాక్షన్ ఘట్టం ప్రారంభమయ్యింది. కవల సోదరులు అన్బారివ్ నేతృత్వంలో ఎక్కువ రోజుల పాటే ఈ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీక్వెన్స్ తో ‘గేమ్ ఛేంజర్’ మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తైనట్టే అని తెలుస్తోంది. చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలీ ఫీమేల్ లీడ్స్ పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితియార్థంలో రానుంది.

Related Posts