బయోపిక్స్ లాంటివి తీస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంచుకునే పాత్రలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో అందరికీ తెలుసు. అతని సినిమాలు ఎలా ఉన్నా.. పాత్రలు మాత్రం అచ్చుగుద్దినట్టు సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ లాంటి సినిమాగా ”వ్యూహం” తీస్తున్నాడు.
దీనికోసం కూడా చాలా పాత్రలు చెప్పక్కర్లేకుండానే గుర్తు పట్టేలా సెలెక్ట్ చేసుకున్నాడు.అయితే రీసెంట్ గా వచ్చిన టీజర్ చూసిన తర్వాత అందరి దృష్టీ జగన్ భార్య పాత్ర పోషించిన అమ్మాయిపై పడింది. తను ఎవరా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
వైఎస్ జగన్ భార్య పాత్ర పోషిస్తోన్న నటి పేరు మానస రాధాకృష్ణన్. తను మళయాలీ. అక్కడ చాలా సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. కొన్నాళ్ల క్రితమే హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. తెలుగులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన హైవే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది తనే. కాకపోతే ఈ సినిమా పోవడంతో తను ఎవరికీ తెలియలేదు.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ మళయాలంలో సెలెక్టెడ్ మూవీస్ చేస్తోన్న తనను రామ్ గోపాల్ వర్మ భలే క్యాచ్ చేశాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో తన లుక్ చూస్తే చాలా హోమ్లీగా ఉంది. వ్యూహం మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ సినిమా తర్వాత తనకు తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందనే అంటున్నారు. మరి ఈ మానస రాధాకృష్ణన్ కెరీర్ కు వ్యూహం ఏ టర్న్ ఇస్తుందో చూడాలి.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…