సెన్షేషనల్ స్టార్ గా చెప్పుకునే హీరోల్లో విజయ్ దేవరకొండ ఉంటాడు. తక్కువ టైమ్ లోనే ఎక్కువ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఎలాంటి కథలో అయినా తనదైన శైలిలో ఇమిడిపోయే టాలెంట్ అతని సొంతం. కానీ కొన్నాళ్లుగా సరైన హిట్ పడటం లేదు. బట్ అతని క్రేజ్ తగ్గలేదు. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఎప్పుడో మొదలైన ఖుషీ మూవీ ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ మూవీ రీ స్టార్ట్ అయ్యే టైమ్ కు కేవలం 30శాతం షూటింగే బ్యాలన్స్ ఉందని చెప్పారు. బట్ మూడు నెలలుగా సాగుతోన్న షూటింగ్ చూస్తే అంతకు మించే ఉన్నట్టు కనిపిస్తోంది. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇది కాక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ మూవీ కమిట్ అయ్యాడు.
రీసెంట్ గా పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో సినిమా స్టార్ట్ అయింది. అయితే ఈ మూడు సినిమాలకూ దాదాపు రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యి ఉన్నాయి. అందుకే విజయ్ దేవరకొండ మూడు షిఫ్ట్స్ లో పనిచేయడానికి సిద్ధమయ్యాడు.
లైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం గౌతమ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీలో ఫెరోసియస్ స్పై గా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ తరహా కథ అతను ఫస్ట్ టైమ్ చేస్తున్నాడు. ఇక పరశురామ్ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. అందుకే సినిమా టైటిల్ కూడా ”ఫ్యామిలీ మేన్” అని పెట్టాలనుకుంటున్నారట.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతోన్న ఈ చిత్రం జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నెక్ట్స్ వీక్ మళ్లీ ఖుషీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడట. అలాగే మరో వారం గౌతమ్ తిన్ననూరి సినిమా సెట్స్ లో ఉంటాడు. అంటే ఒకేసారి మూడు సినిమాల షూటింగ్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడన్నమాట. ఇలా ఒకప్పటి హీరోలు చేసేవారు. కానీ ఇప్పుడు విజయ్ కి తప్పని పరిస్థితి వచ్చింది.
అందుకే మూడు సినిమాలూ ఒకేసారి షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వీటిలో పరశురామ్ మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఆ మేరకు ఖుషీ పూర్తి కాగానే ఆ డేట్స్ ను కూడా ఈ చిత్రానికే ఇవ్వబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలకు సంబంధించి విజయ్ దేవరకొండ లుక్ లో పెద్దగా మార్పులేం లేవట. అందుకే ఇబ్బంది లేకుండా పోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…