టాలీవుడ్ లో మోస్ట్ ఎవెయిటెడ్ కల్ట్ ఎంటర్టైనర్ డిజె టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్. . సిద్దు జొన్నలగడ్డ కథ,స్క్రీన్ప్లే అందించిన ఈ సినిమా మల్లిక్ రామ్ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ పోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ చేసిన ఈ మూవీ మార్చి 29 న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మార్చి 27 న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
డిజె టిల్లు అంటే ఠక్కు న గుర్తొచ్చేది టైటిల్ సాంగ్. ఈ సాంగ్ సీక్రెట్ చెప్పాడు సిద్దు. ఇద్దరు సింగర్స్ అనుకుంటే.. ఇద్దరిలో రామ్ మిరియాల కాల్ లిఫ్ట్ చేసాడనీ.. ముందు పాట రికార్డ్ చేసి తర్వాత డబ్బుల మేటర్ మాట్లాడుకుందామన్నాడనీ.. ఇండస్ట్రీలో ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్లు తక్కువ ఉంటారని చెప్పాడు. ఆ పాట రాసిన కాసర్ల శ్యామ్ కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఈ సినిమాలో యాక్టర్స్ అందరి గురించి చెప్తూ.. సినిమాలోని డైలాగ్స్ తో అలరించాడు సిద్దు.
“గత రెండేళ్లుగా ‘డీజే టిల్లు’ పాటలను, మాటలను మీ జీవితంలో ఒక భాగం చేశారు. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మార్చి 29న థియేటర్లకు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు చెప్పారు మల్లిక్రామ్.
ఈ ఈవెంట్ కి డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ, వెంకీ అట్లూరి, బొమ్మరిల్లు భాస్కర్లు , నీరజ కోన లు హాజరయి శుభాకాంక్షలు తెలియజేసారు. చిత్ర యూనిట్ ని మెచ్చుకుంటూ సినిమా విజయాన్ని కాంక్షించారు.
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…
పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…