‘సలార్‘ సినిమా మిగతా చిత్రాల తరహాలో ఉండదని.. ఈ మూవీ సమ్ థింగ్ స్పెషల్ అని ఇప్పటికే పలుమార్లు చెప్పాడు ప్రశాంత్ నీల్. అందుకే.. ఈ సినిమాలో రెగ్యులర్ మాస్ మసాలా సాంగ్స్ ఏమీ ఉండవట. కంటెంట్ డిమాండ్ మేరకే ఈ చిత్రంలో పాటలు పెట్టామని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ‘సూరీడే..‘ గీతానికి మంచి స్పందన వచ్చింది. ప్రభాస్, పృథ్వీరాజ్ స్నేహం నేపథ్యంలో ఆ పాటను తీర్చిదిద్దాడు ప్రశాంత్.
లేటెస్ట్ గా ‘సలార్‘ నుంచి సెకండ్ సింగిల్ రిలీజయ్యింది. ఒక బడిలో పిల్లలను ఉద్దేశిస్తూ ఈశ్వరిరావు.. ‘విజయ్.. నేను నేర్పించిన పాట గుర్తింది కదా.. పాడు అంటోంది..‘ అప్పుడు ఆ పిల్లలు పాడే గీతంగా ‘ప్రతి గాథలో రాక్షసుడే.. హింసలు పెడతాడు.. అణచగానే పుడతాడు..
రాజే ఒకడు..‘ అంటూ ఈ గీతం సాగుతోంది. రాక్షసుల్ని మట్టుపెట్టడానికి రాజు రాబోతున్నాడు అనే సందేశంతో సాగే ఈ గీతంలో ప్రభాస్ ఎలివేషన్స్ హైలైట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. శృతి హాసన్, సప్తగిరి కూడా ఈ పాటలో కనిపిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతంలో కొంతమంది పిల్లలు ఆలపించిన ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాశాడు.
The first single update from Man of Masses NTR's most awaited movie 'Devara' is here.…
Anasuya, who gained a lot of popularity on the big screen as an anchor, continues…
యాంకర్ గా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై సైతం అడపాదడపా పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే.. అనసూయ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మే 20న…
ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ 'లవ్ మీ'.…
హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు…