పారితోషికంలో సెంచరీ కొట్టబోతున్న సుకుమార్

హీరో డామినేటెడ్ గా చెప్పుకునే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు విపరీతమైన డిమాండ్ ఉంది. తాము నిర్దేశించిన బడ్జెట్ లో.. నిర్దేశించిన స్టార్ కాస్ట్ తో సినిమాలు చేసే వెసులుబాటును కల్పించుకుంటున్నారు. అంతేకాదు.. హీరోలకు దీటుగా పారితోషికాలు పుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి ముందు వరుసలో నిలుస్తాడు. ఇక.. జక్కన్న తర్వాత ఎక్కువ పారితోషికం పుచ్చుకుంటోన్న దర్శకుల లిస్టులో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేరబోతున్నాడట.

‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించాడు సుకుమార్. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కు చేరాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతంగా వస్తోందట. మరోవైపు ‘పుష్ప 2’కి సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాని దక్కించుకోవడానికి ఇండియన్, ఓవర్సీస్ లోని
డిస్ట్రిబ్యూటర్స్ అంతా పోటీ పడుతున్నారు. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ పరంగా భారీ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశాలున్నాయి. ఇక.. ఈ సినిమాకోసం డైరెక్టర్ సుకుమార్ కి కేవలం పారితోషికమే కాకుండా.. వివిధ రకాల రైట్స్ లో షేర్స్ కూడా రానున్నాయట. అలా మొత్తంగా ‘పుష్ప 2’కి సంబంధించి సుకుమార్ కి వంద కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘పుష్ప 2’ వచ్చే యేడాది ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts