మాస్ మహారాజ రవితేజ 75వ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేయబోతున్నాడు. సితార సంస్థతో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకున్న ఈ సినిమాని అనౌన్స్ చేసింది టీమ్. ‘అందరికీ హ్యాపీ ఉగాది రా భయ్‘.. వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపొండ్రి‘ అంటూ విడుదల తేదీపైనా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
భాను భోగారపు దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా ఆద్యంతం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా డిటెయిల్స్ ను తెలియజేయనున్నారట.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…