టాలీవుడ్

ప్రభాస్, మహేష్‌ లను ఢీ కొట్టబోతోన్న రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఎంత రొడ్డకొట్టుడు కథ నుంచి అయినా తనదైన శైలిలో వినోదం పండిస్తాడు. హిట్టూ ఫ్లాపులతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోన్న మాస్ రాజా ఈ యేడాది ఇప్పటికే వాల్తేర్ వీరయ్య, రావణాసుర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. వాల్తేర్ వీరయ్యలో చిన్న పాత్రే అయినా పెద్ద ఇంపాక్ట్ వేశాడు. రావణాసు పోయినా ఇమ్మీడియేట్ గా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేశాడు.

అందులో ఒకటి టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో ప్యాన్ ఇండియన్ లెవల్లో మెప్పించాడు అనే చెప్పాలి. టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్బంగా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. దీంతో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు రవితేజ. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన కార్తీక్ ఘట్టమనేనితో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికే అదిరిపోయే ప్లానింగ్స్ చేశారు.

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ” ఆ లావాకు ఒక పేరుంది” అంటూ హల్చల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఓ భారీ విస్ఫోటనం రాబోతోందని చెబుతూ 20 సెకన్ల వీడియో విడుదల చేశారు. ఈ వీడియోతో పాటు.. ” ఆ లావాకి ఒక పేరుంది. ఆ పేరుకి ఒక ప్రతి ధ్వని ఉంది. ఆ ప్రతిధ్వని .. ఒక ప్రకంపనం పుట్టిస్తుంది ” అనే మాటలు ఉంచారు. ఇదే హైలెట్ అనుకుంటే.. దీంతో పాటు ఓ టీజర్ కూడా విడుదల చేసి మరో షాక్ ఇచ్చాడు మాస్ రాజా.


ఈ మూవీ టీజర్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. టీజర్ ఆరంభంలో వాంటెడ్ పెయింటర్ అనే పోస్టర్ చూసి ఓ టీనేజ్ పాప సెటైర్ వేస్తుంది. “ఒక పెయింటర్ ను పట్టుకోవడానికి ఇంత పెద్ద టీమ్, రా ఏజెన్సీ”.. అంటుంది. ఆ వెంటనే ఓ రైతు అంటాడు.. “పెయింటరా.. పత్తి పండించే రైతయ్యా ఆ సామీ.. దినామూ పంట గురించే ఆలోచన..” అంటాడు. ఈరెండూ విరుధ్ధమైన స్టేట్మెంట్స్ అనుకుంటే నవదీప్ చెప్పే ”కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు..” అనే డైలాగ్ ఓ రేంజ్ లో ఉంటే.. హీరోయిన్ అనుపమ ” ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటీ.. ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటీ” అంటుంది. అక్కడి నుంచి ఈగల్ షాట్ లో ఓ ఈగల్ వెళుతూ ఉంటే కౌబాయ్ గెటప్ లో ఉన్న రవితేజ లెట్స్ కిల్ అనే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో తుపాకీతో గుళ్ల వర్షం కురిపిస్తుంటాడు. అతన్ని పట్టుకోవడానికి కొన్ని టీమ్ లు వెదుకుతుంటాయి. ఇలా టీజర్ తో ఓ హైప్ అయితే తెచ్చారు కానీ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ చూస్తే సర్ ప్రైజింగ్ గా ఉంది.


ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని ప్రకటించాడు. ఆ టైమ్ కు ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఉంది. మహేష్‌ బాబు గుంటూరు కారం ఉంది. ప్రాజెక్ట్ కే ప్యాన్ వరల్డ్ సినిమ అంటున్నారు. గుంటూరు కారంపై భారీ అంచనాలున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలను ఢీ కొట్టి సంక్రాంతి పోటీలో నిలవాలంటే ఈ ఈగల్ లో అత్యంత బలమైన కంటెంట్ ఉంటే తప్ప వర్కవుట్ కాదు. ఒకవేళ ఈ రెండు సినిమాలకూ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా.. మాస్ రాజాకు సమస్య తప్పదు. ఏదేమైనా రవితేజ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Telugu 70mm

Recent Posts

Malayali Star In Mahesh-Rajamouli Movie?

Director Rajamouli's film with superstar Mahesh Babu is in the pre-production stage. Soon.. they will…

50 mins ago

Shankar Is Going To Give A Double Bang To Kamal

The film 'Indian 2', which was completely stopped. 'Indian 2', which is currently in the…

1 hour ago

‘Abbai’ Out Of Dasara for Babai

If Natasimham Balakrishna commits once, he will not listen to anyone. He doesn't care how…

1 hour ago

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

14 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

17 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

17 hours ago