రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒకప్పుడు క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా చూసేవారు. టాలీవుడ్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఘనత వర్మ ది. సినిమాలను ఓ ఫ్యాక్టరీ పద్ధతిలో నిర్మించిన రామ్ గోపాల్ వర్మ.. ఎంతోమంది శిష్యులను రెడీ చేసి ఇండస్ట్రీకి అందించాడు. అలాంటి వర్మ ఇప్పుడు వివాదాలకు అడ్డాగా మారాడు. రామ్ గోపాల్ వర్మ ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నాడనే విమర్శలు చాన్నాళ్ల నుంచి వినిపిస్తున్నాయి. ఈ కోవలోనే.. వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం‘ సిరీస్ సెన్సార్ అడ్డంకులను ఎదుర్కొంది.
అయితే.. లేటెస్ట్ గా ‘వ్యూహం‘ సిరీస్ లోని రెండు చిత్రాలు ‘వ్యూహం, శపథం‘ వారం గ్యాప్ లోనే విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రాలలో మొదటి భాగం ‘వ్యూహం‘ మార్చి 2న విడుదలకు ముస్తాబవుతోంది. దాదాపు 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లేటెస్ట్ గా ఓ ట్వీట్ చేశాడు వర్మ. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అంటూ తన ట్వీట్ కి మెస్సేజ్ పెట్టాడు.
బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కడం.. పిల్లలను కనడం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్టులో దీపిక పదుకొనె కూడా…
ఒక సినిమా చేసి.. బోనస్ గా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్…
ఎక్కడ ఎలాంటి పార్టీ జరిగినా ముందుగా గుర్తొచ్చేది సినిమా వాళ్లే. ఇక.. లేటెస్ట్ గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ…
'బేబి' వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తోన్న మూవీ 'గం గం గణేశా'. ఈ మూవీలో ప్రగతి…
పెళ్లి.. ఆ తర్వాత కుమారుడు పుట్టడం వంటి కారణాలతో సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న కాజల్.. మళ్లీ సెకండ్…
తెలుగులో చాలా తక్కువ సమయంలోనే మంచి స్టార్డమ్ సంపాదించుకున్న నటీమణి పాయల్ రాజ్పుత్. లేటెస్ట్ గా పాయల్ ఓ వివాదంలో…