కొత్త ఎకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్‌

పవన్ కళ్యాణ్‌ సినిమాలతోనూ పొలిటికల్ గానూ జెట్ స్పీడ్ లో ఉన్నాడిప్పుడు. ఒకేసారి మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో బ్రో పూర్తయింది. ఈ నెల 28న విడుదల కాబోతోంది. రీసెంట్ గానే స్టార్ట్ అయిన ‘ఓజి’ ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మరోటి ఉస్తాద్ భగత్ సింగ్. ఇది కూడా త్వరలోనే మరో కీలక షెడ్యూల్ కు వెళ్లబోతోంది. అటు చూస్తే వారాహి విజయ యాత్ర అంటూ ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్‌. ఈ సారి పొలిటిల్ గా మరింత దూకుడు పెంచాడు. విమర్శల్లో పదును పెరిగింది. రాజకీయంగా మరింత పరిణతి కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్‌ సోషల్ మీడియా అంటే కేవలం ట్విట్టర్ లో మాత్రమే ఉన్నాడు. ట్విట్టర్ లోనే తన ప్రశ్నలన్నీ సంధిస్తూ వెళుతున్నాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు పవన్ కళ్యాణ్‌.


పవన్ కళ్యాణ్‌ కొత్తగా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంటర్ అయ్యాడు. తాజాగా ఆయన కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడ. మరి కొత్త అకౌంట్ అంటే ఆయన్ని దేవుడు అనుకుంటోన్న అభిమానులు ఊరుకుంటారా.. వెంటనే ఫాలో చేయడం మొదలుపెట్టారు. ఇట్టా ఓపెన్ చేశాడో లేదో అట్టా ఐదు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు. ఈ ట్విట్టర్ లో ” ఎలుగెత్తు.. ఎదురించు, ఎన్నుకో.. జై హింద్..” అని రాసుకున్నాడు పవన్ కళ్యాణ్‌. సో.. ఇక ఇన్స్ స్టా వేదికగా కూడా పొలిటికల్ సెటైర్స్ పడబోతున్నాయన్నమాట. .

Related Posts