హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఇటు తెలుగు, అటు తమిళం భాషల్లో మంచి అవకాశాలతో దూసుకెళుతోంది మీనాక్షి చౌదరి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ఆ తర్వాత ‘ఖిలాడి, హిట్, గుంటూరు కారం’ సినిమాలతో మురిపించింది. ప్రస్తుతం సితార సంస్థలో ‘లక్కీ భాస్కర్’ చేస్తుంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది.
మరోవైపు.. తమిళంలో ఇలయదళపతి విజయ్ తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’లో నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా చేస్తుంది మీనాక్షి. ఇక.. కోలీవుడ్ లో లేటెస్ట్ గా మరో ఆఫర్ అందుకుందట. పాపులర్ కమెడియన్ కమ్ హీరో సంతానం నటించే ‘దిల్లుకు దుడ్డు-4’లో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుందట.
సంతానం నటించే హారర్ కామెడీ సిరీస్ ‘దిల్లుకు దుడ్డు’కి మంచి పాపులారిటీ ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలొచ్చాయి. త్వరలోనే.. నాల్గవ చిత్రం పట్టాలెక్కబోతుంది. ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హీరో ఆర్య నిర్మిస్తున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…
మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…
రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…
In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…