మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మాస్ మహారాజ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి ‘ఎ.ఎమ్.బి.’ ప్రారంభిస్తే.. రెబెల్ స్టార్ ప్రభాస్ తన మిత్రులతో కలిసి సూళ్లూరుపేటలో ‘వి ఎపిక్’ను ఆరంభించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్స్ లో ఒకటి సూళ్లూరుపేటలో ఉంది. ఇక.. వీరి బాటలోనే ఆ తర్వాత విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ప్రవేశించారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ‘ఎ.వి.డి’ మల్టీప్లెక్స్ ప్రారంభిస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏషియన్ తో కలిసి హైదరాబాద్ అమీర్ పేటలో ‘ఎ.ఎ.ఎ.’ ఆరంభించాడు.

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ప్రవేశించబోతున్నాడట. ఏషియన్ తో కలిసి రవితేజ హైదరాబాద్ దిల్ షుక్ నగర్ లో ఆరు స్క్రీన్లతో కూడిన మల్టీప్లెక్స్ కు శ్రీకారం చుడుతున్నాడట. ఈ మల్టీప్లెక్స్ పేరు ‘ఎ.ఆర్.టి’గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద.. ఇప్పటికే నిర్మాతగానూ సత్తా చాటుతున్న రవితేజ.. త్వరలో ఎగ్జిబిషన్ రంగంలోకి కూడా ప్రవేశించబోతున్నాడన్నమాట. మరోవైపు రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత అనుదీప్ కె.వి. దర్శకత్వంలో ఒక ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు.

Related Posts