సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు వంటి వారు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘లగ్గం’. సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రమేశ్ చెప్పాల దర్శకుడు. ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముఖ్యంగా.. తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారట.
ఈ కల్చరర్ ఫ్యామిలీ డ్రామా కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. కామారెడ్డి, జనగామ, బీబీపేట ఇస్సానగర్ ప్రాంతాల్లో.. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందట. ఏప్రిల్ 11 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…