బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే సౌత్ సినిమా ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకూ జాన్వీ కపూర్ కేవలం మూడు రోజులు మాత్రమే షూటింగ్ చేసింది.
స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ లే చిత్రీకరిస్తున్నారు. ఇంకా టాకీ, పాటలు మొదలు కాలేదు. అందుకే అమ్మడు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్ లో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా తను తిరుమల శ్రీవారిని సందర్శించుకుంది. మామూలుగా జాన్వీ కపూర్ కు భక్తి ఎక్కువే. ఇప్పటికే చాలాసార్లు తిరుపతి దర్శనానికి వచ్చింది. అయితే ఈ సారి సోలోగా రాలేదు. అందరికీ దొరికిపోయేలా ప్రియుడితో కలిసి వచ్చింది.
కొన్నాళ్లుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో శిఖర్ పహారియా అనే కుర్రాడితో ప్రేమలో ఉంది అనే టాక్స్ ఉన్నాయి. ముంబైలో ఈ ఇద్దరూ కలిసి మీడియాకు కనిపించారు. బట్ తమ మధ్య ఏదో ఉందన్న విషయాలను మాత్రం కొట్టి పడేశారు.
బట్ ఇవాళ తిరుపతికి కూడా ఆ కుర్రాడితోనే కలిసి వచ్చింది. అసలే లవ్ బర్డ్స్ అనే రూమర్స్ ఉన్న టైమ్ లో ఇలా పబ్లిక్ గా బయటకు వస్తే ఆ రూమర్స్ కు ఇంకా బలం పెరుగుతుంది కదా.. అయితే తిరుపతి లాంటి ప్రదేశంలో తమను ఎవరూ గుర్తించరు అనుకుందేమో. కానీ కొన్ని విషయాలను ఎంత దాచాలనుకున్నా దాగవు అంటారు కదా.. అలా అమ్మడు కూడా ఇలా దొరికిపోయింది.
The first single update from Man of Masses NTR's most awaited movie 'Devara' is here.…
Anasuya, who gained a lot of popularity on the big screen as an anchor, continues…
యాంకర్ గా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై సైతం అడపాదడపా పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే.. అనసూయ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మే 20న…
ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ 'లవ్ మీ'.…
హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు…