సాయి పల్లవి మళ్లీ ఆ దర్శకుడితోనేనా ..?

సాయి పల్లవి.. అనుమానమే అక్కర్లేకుండా ఈ తరం మహానటి. పాత్రలను స్టడీ చేసి మరీ నటిస్తోందా అనిపించేలా ఏ పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోతుంది. ఫస్ట్ మూవీ నుంచే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసుకున్న ఈ హోమ్లీ హీరోయిన్.. తర్వాత వరుస విజయాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ కు దూరంగా.. నటనకు దగ్గరగా ఉండే పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. దూసుకుపోయింది. ఇక రౌడీ బేబీ పాటలతో తన స్టెప్పులకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.

బేసికల్ గా డ్యాన్సర్ కాబట్టే సాయి పల్లవిలో ఎక్స్ ప్రెషన్స్ ఈజీగా పలుకుతాయి. అవి సహజంగానూ కనిపిస్తాయి. లవ్ స్టోరీ మూవీతో అవార్డ్ విన్నింగ్ నటన చూపించిన తను తర్వాత చేసిన విరాటపర్వంపై చాలా అంచనాలు పెట్టుకుంది. నక్సలైట్ గా ఉంటూనే ఇన్ఫార్మర్ అన్న ఆరోపణలతో నక్సలైట్స్ చేతిలోనే హతమైన వెన్నెల అనే అమ్మాయి పాత్రలో అద్భుతమైన నటన చూపించింది.

ఈ సినిమా తన కెరీర్ కు బెస్ట్ అవుతుంది అనుకుంది. బట్ కమర్షియల్ గా విరాటపర్వం అనుకున్నంతగా పర్ఫార్మ్ చేయలేదు. అఫ్ కోర్స్ డైరెక్షన్ లోనూ కొన్ని లోపాలున్నాయి. వాస్తవ కథను దాటి కథనం రాసుకున్నట్టుగా కనిపించింది. ఈ కారణంగానే అభ్యుదయ వాదులు కూడా విరాటపర్వంపై విమర్శలు చేశారు.


ఈ సినిమా తర్వాత కంప్లీట్ గా కామ్ అయిపోయింది. తమిళ్ లో చేసిన గార్గిఅనే సినిమా వచ్చింది. బట్ ఇది ఆర్ట్ సినిమాలా ఉండటం, లవ్ స్టోరీకి దగ్గరగా కథ కనిపించడంతో తెలుగువాళ్లు పట్టించుకోలేదు. అప్పటి నుంచి నుంచి తెలుగులో మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు సాయి పల్లవి. మరి తనకు ఆఫర్స్ లేవా అంటే అదీ లేదు. పోనీ తమిళ్ లో అయినా చేస్తుందా అంటే అక్కడా చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గానే శివకార్తికేయన్ సినిమాకు ఓకే చెప్పింది. ఇటు తెలుగు నుంచి కొంతమంది దర్శకులు తనను అప్రోచ్ అయ్యారు. బట్ తను ఓకే చెప్పలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్నది ఏంటంటే.. తను మళ్లీ తన ఓల్డ్ డైరెక్టర్ తోనే తెలుగు సినిమా చేయబోతోందట.


ఓల్డ్ డైరెక్టర్ అంటే శేఖర్ కమ్ముల కాదు. విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల. విరాటపర్వం టైమ్ లో వీరి మధ్య మంచి స్నేహం కూడా కుదిరింది. విరాటపర్వం తర్వాత వేణు కూడా యేడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఓ భారీ కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఆ మధ్య ఈ కథలో నాగ చైతన్య నటిస్తాడు అనే వార్తలు వచ్చాయి. కానీ మరో హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ స్టోరీ గురించి సాయి పల్లవికి విరాటపర్వం టైమ్ నుంచే తెలుసట.

ఈ కథలో తనే హీరోయిన్ అని వేణు కూడా అప్పుడే ఫిక్స్ అయ్యాడని టాక్. సో.. ప్రొడక్షన్ హౌస్ రెడీగా ఉంది. హీరో ఫైనల్ అయిన తర్వాత సాయి పల్లవిని అనౌన్స్ చేయబోతున్నారు. అందుకే తను తెలుగుకు ఇంత గ్యాప్ ఇచ్చిందంటున్నారు. అయినా వేణుతో చేయాలనుకుంటే చేయొచ్చు. దానికి ఇంత గ్యాప్ దేనికి..? అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వినిపిస్తోన్న ప్రశ్న.. మరి అది కూడా నిజమే కదా..?

Related Posts