ఏఎన్నార్ మనవడితో శ్రీదేవి కూతురు

అక్కినేని నాగేశ్వరరావు.. శ్రీదేవి జోడీకి ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు.అఫ్‌కోర్స్ ఈ తరానికి పెద్దగా తెలియకపోయినా.. ఏ పాత సినిమాల్లో చూసినా వీరి హుషారైన స్టెప్పులు అదిరిపోయే కెమిస్ట్రీ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది.

57యేళ్ల వయసులో అక్కినేని నాగేశ్వరరావు ప్రేమాభిషేకం అంటూ నాటి ఆంధ్రదేశాన్ని శ్రీదేవితో కలిసే ఉర్రూతలూగించాడు. ప్రస్తుతం ఇద్దరూ చనిపోయారు. అయితే వీరి వారసులు మాత్రం హవా చేస్తున్నారు. త్వరలోనే ఆ వారసుల కాంబినేషన్ లో సినిమా వస్తుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది.


అక్కినేని మూడో తరం వారసుడైన అఖిల్ అరంగేట్రం నుంచి అన్నీ ఫ్లాపులే చూస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫర్వాలేదనిపించుకున్నా.. అతను వచ్చిన ఫ్యామిలీ లెగసీకి అది సరిపోదు. చివరగా వచ్చిన ఏజెంట్ ఏకంగా ట్రోల్స్ కు గురయింది. అయినా ప్రస్తుతం అతనితో ఓ భారీ బడ్జెట్ మూవీ తీయబోతోంది మైత్రీ మూవీస్ బ్యానర్.

అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ అన్ లిమిటెడ్ బడ్జెట్ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ తో పాటు హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను కూడా తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారట. ఇది కాస్త సెమీ సోసియో ఫాంటసీ కథ కూడా కావడతో ఈ జోడీ కూడా ప్లస్ అవుతుందనే భావనలో ఉన్నారు మేకర్స్.


అయితే జాన్వీని కన్విన్స్ చేయడం అంత సులువేం కాదు. అమ్మడు భారీ రెమ్యూనరేషన్ అడుగు�