టాలీవుడ్

నన్ను అవమానిస్తే ఎన్టీఆర్ ను అవమానించినట్టే – లక్ష్మీ పార్వతి

దివంగత నటుడు, ముఖ్యమంత్రి నందమరి తారకరామారావు స్మారక చిహ్నంగా ఇవాళ(సోమవారం) ఆయన ఫోటోతో వంద రూపాలయ నాణేన్ని విడదల చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదలైన ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబాన్ని ఆహ్వానించారు.

అయితే ఆయన భార్యనైన తనను ఆహ్వానించలేదని రెండు మూడు రోజుల నుంచే ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతిని తమ తండ్రి భార్యగా ఆయన వారసులెవరూ అంగీకరించడం లేదు. అందుకే రాష్ట్ర పతి భవన్ నుంచి ఆమెకు ఆహ్వానం లేదు. కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత ఆమె తన అక్కసులను వెళ్లగక్కుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ” ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు.. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు.. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ను వాడుకుంటున్నారు.. ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలి.. నన్ను పిలవకుండా పురంధేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు.. ఎన్టీఆర్ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా..? ఎన్టీఆర్ తో వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కధనాలు ఉన్నాయి.. సాక్షాత్తు ఎన్టీఆర్ అనేకసార్లు బహిరంగంగా చెప్పారు.. నన్ను పెళ్ళి చేసుకోలేదు.. ఉంచుకున్నారు అని టిడిపి ప్రచారం చేస్తుంది.. ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్ గా పెట్టుకున్నారా.. పెళ్లి చేసుకున్నాడా.. చెప్పాలి.. ఎన్టీఆర్ యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..? ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నాను.. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను..

చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా.. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా.. వీళ్ళ గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తా.. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు పడుతూ ఉండాలి.. పురంధరేశ్వరి కి ఏం మాయ రోగం వచ్చింది.. ఇలా చేస్తుంది.. పురంధరేశ్వరి కి నేను ఏమి అడ్డం వచ్చాను.. ఆయన కష్టాల్లో ఉంటే పురంధరేశ్వరి వచ్చిందా..? నన్నెందుకు చులకన చేస్తున్నారు.. నన్ను చులకన చేస్తే ఎన్టీఆర్ ను చేసినట్టే.. ఎన్టీఆర్ ను చంద్రబాబు బయట వెన్నుపోటు కు ఇంటర్నల్ గా పురంధరేశ్వరి ప్రధాన కారకురాలు.. పురంధేశ్వరి రాజకీయాల్లోకి వద్దు అన్నారని ఎన్టీఆర్ పై కుట్ర చేసింది.. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది.. మళ్ళీ బావా మరదళ్లు ఏకమైపోయారు..

నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు.. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది..
కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి చేసింది పురంధరేశ్వరి.. ఈరోజు నుండి పురంధరేశ్వరి పై పోరాటం చేస్తా.. చంద్రబాబు, పురంధరేశ్వరి ఇద్దరిని ఇంటికి పంపిస్తా..” అంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన పురందేశ్వరి, చంద్రబాబు, భువనేశ్వరి, బాలకృష్ణలపై విరుచుకుపడింది. మరి ఈవిడకు కౌంటర్ వస్తుందా లేదా అనేది వేచి చూడక్కర్లేదు. వాళ్లు ఎప్పట్లానే లైట్ తీసుకుంటారేమో.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

11 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

12 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

12 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

12 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

18 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

18 hours ago