బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి‘. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంటాయి. ఇక.. తన సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘హీరామండి‘ సిరీస్ ను తెరకెక్కించాడు భన్సాలీ. ‘ది డైమండ్ బజార్‘ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. తన గత చిత్రం ‘గంగూభాయి కతియవాడి‘ తరహాలోనే వేశ్యల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
స్వాతంత్ర్యం రాకముందు లాహోర్ లోని వేశ్యల విలాసవంతమైన జీవితం.. స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా వంటి నటీమణులు నటించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘హీరామండి‘ రేపటి (మే 1) నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…