దశాబ్దాల తర్వాత తెలుగులో అసలు సిసలు మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టిన స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్. టాలీవుడ్ లో రైవల్రీ ఫ్యామిలీగా చెప్పుకునే ఈ స్టార్ హీరోలు ఇద్దరితోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కించి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ టైమ్ లోనూ.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అరెనాలోనూ గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసిన ప్రచారం ఎప్పటికీ మరవలేం.’ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎవరి సినిమాల పనులతో వారు బిజీ అయిపోయారు. మళ్లీ లేటెస్ట్ గా ఈ గ్లోబల్ స్టార్స్ ఇద్దరూ ఒకే ఫ్రేములో కనిపించారు. ఒకవైపు బెంగళూరులో ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగే ఫంక్షన్ కు అటెండ్ అయ్యేందుకు ఎన్టీఆర్.. అంబానీల పెళ్లివేడుకలో పాల్గొనేందుకు జామ్ నగర్ బయలేదేరిన రామ్ చరణ్.. ఇద్దరూ ఒకే సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ కలుసుకున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…
పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…