2014లో వచ్చిన గీతాంజలి సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇదే టైటిల్ తో 1989లో నాగార్జున – మణిరత్నం కాంబోలో వచ్చిన క్లాసికల్ మూవీ పేరును చెడగొడుతుందా అనుకున్నారంతా. కానీ నిలబెట్టింది. రాజ్ కిరణ్ డైరెక్షన్ లో అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రావు రమేష్, షకలక శంకర్, మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రల్లో నటించిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కు మంచి అప్లాజ్ కూడా వచ్చింది. కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే కూడా చాలా ప్లస్ అయింది. అయితే అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అది ఇన్నాళ్లకు సెట్ అయింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ప్రారంభం అయింది. ఇవాళే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.
ఇక ఈ సెకండ్ పార్ట్ కు దర్శకుడు మారినట్టు కనిపిస్తోంది. మిగతా టీమ్ అంతా ఉన్నారు. అంజలి, శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్ తో పాటు కోన వెంకట్ ఈ సారి స్క్రీన్ ప్లేతో పాటు సమర్పకుడుగా కూడా ఈ సీక్వెల్ లో పార్ట్ అయ్యి ఉన్నాడు. ఎమ్.వి.వి సినిమా బ్యానర్ నిర్మిస్తోంది. జి.వి దర్శకత్వం చేస్తున్నాడు. మెయిన్ టీమ్ అంతా పాల్గొనగా ముహూర్తం షాట్ తీసి షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈ సారి ఏ తరహాలో నవ్విస్తూ భయపెడతారో కానీ.. సీక్వెల్ టైటిల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అని పెట్టారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…