టాలీవుడ్

గేమ్ ఛేంజర కొత్త షెడ్యూల్

రామ్ చరణ్‌ – శంకర్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ ఓ అంతులేని కథలా సాగుతోంది. 2021 డిసెంబర్ లోనే ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటి వరకూ 25శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోలేదు. మధ్యలో శంకర్ కోర్ట్ లో ఓడిపోయి భారతీయుడు2ను పూర్తి చేయాల్సి రావడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన బెట్టాడు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఏం చేయలేక చేతులెత్తేశాడు. దీంతో రామ్ చరణ్‌ కు పనిలేకుండా పోయింది. కొన్నాళ్లుగా ఇదుగో అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప షూటింగ్ మాత్రం ముందుకు సాగడం లేదు. ఫైనల్ గా ఓ కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది.


గేమ్ ఛేంజర్ కోసం ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు శంకర్. ఈ నెల చివరి నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై అత్యంత కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నాడట. ఈ పార్ట్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొనబోతోంది. అయితే ఇది ఎన్ని రోజుల షెడ్యూల్ అనే క్లారిటీ లేకపోయినా భారీ షెడ్యూల్ అనే రొటీన్ డైలాగ్ మాత్రం వాడుతున్నారు. ఈ షూటింగ్ పార్ట్ కోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మరి ఇకనైనా కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తారా లేక మళ్లీ ఎప్పట్లానే బ్రేకులు పడతాయా అనే ప్రశ్నకు కూడా ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు. జస్ట్ మరో షెడ్యూల్ మొదలైందంతే.

Telugu 70mm

Recent Posts

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

43 mins ago

Mirnalini Ravi

50 mins ago

Ketika Sharma

1 hour ago

Janhvi Kapoor

1 hour ago

NehaSolanki

1 hour ago