మామ ఫంక్షన్ కు ఆ ఇద్దరూ స్పెషల్

పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే ప్రత్యేకంగా గెస్ట్ లు కావాలా.. అతనుంటే సరిపోతుంది. ఎంత పెద్ద గెస్ట్ వచ్చినా అతని ముందు తక్కువే అన్నట్టుగా ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు వస్తే ఎలా ఉంటుంది..ఎస్.. పవన్ సినిమాల ఫంక్షన్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటారు.

ఈ సారి బ్రో మూవీలో మేనల్లుడు సాయితేజ్ ను హీరోగా మార్చాడు. తను ఓ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా త్రివిక్రమ్ ను ఇన్వైట్ చేశారు. బట్ ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇన్వైట్ చేయించుకున్నాడు.

తన అన్న నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో పాటు మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథులుగా వచ్చారు. నిజానికి పవన్ ఫంక్షన్ కు ఫ్యాన్స్ గా అటెండ్ అయితే చాలు అనుకునే దశ నుంచి వీళ్లు ఇప్పుడు గెస్ట్ లుగా వచ్చారంటే కారణం పవన్ కళ్యాణే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వీరి మాటలు ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని నింపాయి. ఆ మాటల్లో మామ, బాబాయ్ పై వీరికి ఉన్న అభిమానాన్ని మరోసారి ప్రదర్శించే అవకాశం వచ్చింది. వరుణ్, వైష్ణవ్ తేజ్ లు ఈ ఫంక్షన్ కు చివరి నిమిషంలో ఇన్వైట్ చేయబడ్డారు. అయినా పవన్ సినిమా అంటే ఆగుతారా.. అందుకే లగెత్తుకుని వచ్చారు.

Related Posts