బ్రో కోసం వర్షాన్ని లెక్క చేయని అభిమానులు..

పవన్ కళ్యాణ్, సాయితేజ్ నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈవెంట్ ను రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలుపెట్టారు. అయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 6గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంత వర్షంలోనూ పాస్ లకు విపరీతమైన డిమాండ్ రావడం విశేషం.

అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరూ వర్షాన్ని ఏ మాత్రం లెక్క చేయలేదు అనే కదా అర్థం. నిజానికి హైదరాబాద్ వర్షాల కారణంగా హైటెక్ సిటీ ఏరియాలో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఆ కారణంగానో 6 గంటల నుంచి మొదలు కావాల్సిన ప్రోగ్రామ్ ను 8.30 గంటలకు మొదలుపెట్టారు.

బట్ అక్కడ ఉన్నది పవన్ ఫ్యాన్స్ కదా. అందుకే వర్షాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. వేలకొద్దీ అభిమానులు శిల్పకళా వేదిక చుట్టుపక్కలకు చేరుకున్నారు.

మామూలుగ ఇలాంటి టైమ్ లో అభిమానులందరికీ పాస్ లు రావు. రాకపోయినా ఏదో ఒక ఆశతో అక్కడికి చేరుకుంటారు ఫ్యాన్స్. వర్షం కదా.. అలాంటి వారు తగ్గుతారు అనుకున్నారు. కానీ లేదు. వర్షం ఉన్నా.. పాస్ లు లేకపోయినా రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు శిల్పకళా వేదిక వద్దకు చేరుకున్నారు.


ఇక ప్రోగ్రామ్ మొదలైన తర్వాత మాట్లాడుతున్న గెస్ట్ లను బట్టి అదే పనిగా పవన్ కళ్యాణ్ పై నినాదాలు చేస్తున్నారు.సిఎమ్.. సిఎమ్ అంట పవన్ కు ఇష్టం లేని స్లోగన్స్ అదే పనిగా చేస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉంది అనేందుకు ఇంత పెద్ద వర్షంలో కూడా భారీగా వచ్చిన అభిమానులే నిదర్శనం.