మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడం విశేషంగా. దీంతో ఆచార్య కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పిబ్రవరి 4న ఆచార్య విడుదల అని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆచార్య ఇంకా రిలీజ్ కాకుండానే.. చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ స్టార్ట్ చేశారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుంటే… కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేస్తుంది. అలాగే బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు. వీటితో పాటు ఛలో, భీష్మ చిత్రాలతో వరుసగా సక్సస్ సాధించిన యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా సినిమా చేయడానికి చిరంజీవి ఓకే చెప్పారు. ఈ భారీ క్రేజీ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి. దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించేందుకు శృతి హాసన్ ని కాంటాక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అలాగే శృతిహాసన్ కూడా చిరంజీవి సరసన నటించేందుకు ఓకే చెప్పిందని టాక్ వచ్చింది. తాజా వార్త ఏంటంటే.. ఇప్పుడు శృతి ప్లేస్ను అనుష్క శెట్టి రీ ప్లేస్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో చిరు సరసన స్వీటీ ఆడిపాడనుందట. గతంలో చిరంజీవి సరసన అనుష్క స్టాలిన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు చిరు పక్కన కథానాయికగా నటించనుంది. మరి… దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో వస్తుందేమో చూడాలి.