ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ ఎప్పుడో చెప్పిన అశ్వ‌నీద‌త్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌, మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్‌ అశ్విన్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ప్రాజెక్ట్‌ K. ఈ పాన్ వ‌రల్డ్ మూవీని సుప్ర‌సిద్ధ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తుంటే.. కీల‌క పాత్ర‌లో అమితాబ్ న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు క్రియేటీవ్ హెడ్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషం. అయితే.. ఈ సినిమాని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

కార‌ణం ఏంటంటే.. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటుంటే.. నాగ్ అశ్విన్ పాన్ వ‌ర‌ల్డ్ అంటూ ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆమ‌ధ్యా రామోజీ ఫిలింసిటీలో చాలా గ్రాండ్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆత‌ర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత అశ్వ‌నీద‌త్ ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని.. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ షెడ్యూల్‌లో అమితాబ్, దీపికా పాల్గొనబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే వచ్చే సంవ‌త్స‌రం వేసవిలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తాం అని తెలిపారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Related Posts