ఆచార్య మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..?

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఇందులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఆచార్య మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే… క‌రోనా కార‌ణంగా ఆచార్య విడుద‌ల వాయిదా ప‌డుతూనే ఉంది. అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య విడుద‌ల అని ప్ర‌క‌టించారు.

అయితే… క‌రోనా థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా మ‌ళ్లీ ఆచార్య‌ వాయిదా ప‌డింది. తాజాగా ఏప్రిల్ 1న ఆచార్య విడుద‌ల‌ అని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే… ఇప్పుడు ఏప్రిల్ 1న కూడా ఆచార్య రావ‌డం క‌ష్ట‌మే అని మ‌రోసారి వాయిదా ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. కార‌ణం ఏంటంటే… ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ విడుద‌ల అని ప్ర‌క‌టించారు. ఒక‌వేళ క‌రోనా త‌గ్గ‌క‌పోతే.. ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా నాయ‌క్ రిలీజ్ కాక‌పోతే… ఏప్రిల్ 1న భీమ్లా నాయ‌క్ విడుద‌ల చేయాలి అనుకంటున్నార‌ట‌.

అదే జ‌రిగితే… ఆచార్య మ‌రోసారి వాయిదా ప‌డ‌డం ఖాయం అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మెగా అభిమానుల్లో ఆచార్య విష‌య‌మై.. మ‌ళ్లీ టెన్ష‌న్ మొద‌లైంది. మ‌రి… ఆచార్య ఎప్పుడు వ‌స్తుందో ఏంటో చూడాలి.

Related Posts