శంక‌ర్ మూవీ సెట్స్ పై ఉండ‌గానే..

చ‌ర‌ణ్ మ‌రో మూవీ స్టార్ట్ చేయ‌నున్నారా..?
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ న‌టించిన రెండు సినిమాలు.. రెండు నెలల గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి. అందులో ఒక‌టి ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ కాగా, మ‌రొక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఆచార్య‌. ఈ రెండు చిత్రాలు భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు కావ‌డం విశేషం. ఈ చిత్రాల‌తో పాటు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీలో కూడా చ‌ర‌ణ్‌ న‌టిస్తున్నారు. ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ఈ సంవత్సరం మరొ సినిమాను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ ఓ భారీ చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ స్నేహితుడు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను గౌతమ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

క‌రోనా కార‌ణంగా చాలా టైమ్ వేస్ట్ అయ్యింద‌ని.. ఇక నుంచి టైమ్ వేస్ట్ కాకుండా వ‌రుస‌గా.. స్పీడుగా సినిమాలు చేయాల‌నుకుంటున్నారు చ‌ర‌ణ్‌. శంక‌ర్ తో చేస్తున్న మూవీని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌నున్న మూవీని 2023 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. మొత్తానికి చ‌ర‌ణ్ స్పీడు పెంచాడు. ఇక‌ మెగా అభిమానుల‌కు పండ‌గే.

Related Posts