విజయ్ దేవరకొండ, సమంతపై ఆ ప్రచారం వద్దు..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ వచ్చే ఆగష్టులో విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఆ మూవీ రాకుండానే క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్లో మూవీని పట్టాలెక్కించాడు రౌడీ స్టార్. ఖుషీ పేరుతో తెరెకెక్కుతున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీమ్ షూటింగ్ ఆపేసి హైదరాబాద్ వచ్చేసింది. అందుకు కారణం విజయ్, సమంతలకు సెట్ల్ యాక్సెడెంట్ అయ్యిందనే టాక్ హల్ చల్ చేస్తోంది. కానీ అది నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.

ఖుషీ…ఈ పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా గుర్తుకొస్తుంది. కానీ ఇదే పేరుతో ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సిజిలింగ్ బ్యూటీ సమంత కాంబోలో ఓ లవ్ స్టోరీతో సినిమా తెరకెక్కుతోంది. క్లాస్ చిత్రాలతో మెప్పించే శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఖుషీపై ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఖుషీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్స్ షూటింగ్ ని రీసెంట్ గా కాశ్మీర్ లో స్టార్ట్ చేశారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో టీమ్ అంతా హైదారాబాద్ కి వచ్చేసింది. కానీ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంతకి సెట్స్ యాక్సిడెంట్ అవ్వడం వల్లే వచ్చేశారనే రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి స్పందిస్తూ దర్శకుడు శివ నిర్వాణ అదంతా ఫేక్ న్యూస్ ని క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా విజయ్, సమంతల ఖుషీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు మేకర్స్.

అయితే ఈ చిత్రానికి సంబంధించి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సినిమా టీమ్ వాటిని ఖండించింది. ఖుషీ మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగిందని.. ఆ ప్రమాదంలో విజయ్, సమంత గాయపడ్డారని కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ నిజం కాదనీ.. ఏకధాటిగా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ చేసుకుని కశ్మీర్ నుంచి టీమ్ అంతా హైదరాబాద్ వచ్చిందని.. ఇలాంటి వార్తలను ప్రచురించొద్దని మూవీ టీమ్ కోరింది.

Related Posts