హీరోల్లో ఐక్య‌త లేదు. నాని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా స‌క్స‌స్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే. శ్యామ్ సింగ రాయ్ మూవీ రిలీజ్ కి ముందు రోజు నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ల రేటు త‌గ్గించ‌డం క‌రెక్ట్ కాద‌ని.. థియేట‌ర్ ఓన‌ర్ క‌లెక్ష‌న్ క‌న్నా.. ప‌క్క‌న ఉన్న కిర‌ణా కొట్టు క‌లెక్ష‌న్ ఎక్కువుగా ఉంద‌ని కామెంట్ చేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది.

నాని వ్యాఖ్యాలకు కొంత మంది సినీ ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు తెలియ‌చేయ‌డం.. వైసీపీ నాయ‌కులు నానిని విమ‌ర్శించ‌డం తెలిసిందే. అయితే.. నానికి సినీ ప్ర‌ముఖుల నుంచి సామాన్యుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఇదిలా ఉంటే.. నాని మళ్ళీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. ఇంత‌కీ నాని ఏమ‌న్నారంటే.. వ‌కీల్ సాబ్ సినిమా నుంచి టాలీవుడ్ కి స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయి. అప్పుడే క‌నుక హీరోలంద‌రూ ఒక్క‌తాటి పైకి వ‌చ్చి రియాక్ట్ అయ్యుంటే.. ఇప్పుడు ఈ స‌మ‌స్య ఉండేది కాదు అప్పుడే ప‌రిష్కారం అయ్యుండేది.

హీరోల్లో ఐక్య‌త లేదు. ఇది నిజం. నా మాట క‌నుక అబ‌ద్ధం అయితే.. నేను చాలా ఆనందిస్తాను అంటూ టాలీవుడ్ లో ఉన్న స‌మ‌స్య‌ను నిజాయితీ బ‌య‌ట‌పెట్టాడు. ఇప్పుడు నాని వ్యాఖ్య‌లు మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి.. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Posts