సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి.. సినిమాల గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటారు. కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. మహేష్, సితార కలిసి ఐరన్ మ్యాన్ తో సెల్పీ తీసుకున్నారు.
ఈ ఫోటోలో మహేష్ బాబు, సితార ఇద్దరూ మాస్క్ లు పెట్టుకుని కనిపిస్తున్నారు.
వీరిద్దరి వెనుక ఉన్న ఐరన్ మ్యాన్ బొమ్మ కూడా సెల్ఫీ కోసం ఫోజ్ ఇచ్చినట్టుగా కెమెరా వైపే చూస్తుంది. ఈ పిక్ని షేర్ చేస్తూ మహేష్ క్రిస్మస్ విషెష్ తెలియచేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మహేష్ మోకాలికి సర్జరీ చేయించుకోవడంతో షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. ఫిబ్రవరి నుంచి తిరిగి షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన మహేష్ సర్కారు వారి పాటతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.