మహేష్ బాబుతో మొదలు.. ప్రముఖులంతా హడలు

నిన్నటికి నిన్న మీనా ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. లేటెస్ట్ గా మహేష్ బాబు పాజిటివ్ గా తేలాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ గా తేలడం వింతేమీకాదు. ఆయన నిత్యం వేలాదిమంది మధ్యలో పనిచేస్తుంటాడు. పైగా రోజుకో కంట్రీ అన్నట్టుగా తిరుగుతుంటాడు. అయితే సినిమా షూటింగ్.. లేదంటే ఫ్యామిలీ వెకేషన్ అంటూ ఎప్పుడూ జనాల మధ్యే ఉంటుంటాడు. అయితే ప్రస్తుతం కరోనా మళ్లీ విజృంభిస్తోంది.ఈ తరుణంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఏదైతేనేం.. చాలా తక్కువ లక్షణాలతో తను కరోనా పాజిటివ్ గా తేలానని ఆయన ట్వీట్ చేసిన వెంటనే అది వైరల్ అయిపోయింది. మైల్డ్ సింమ్టోమ్స్అయినా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు మహేష్. ఇక థర్డ్ వేవ్ లో తన విశ్వరూపం సూపర్ స్టార్ తో మొదలుపెట్టిన కరోనా ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని భయపెడుతోంది.
మహేష్ తర్వాత హైదరాబాద్ లోనే యశోద సినిమా షూటింగ్ లో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ గా తేలింది. తను కూడా వెంటనే హైదరాబాద్ లోనే ఓ హోటెల్ లో ఐసోలేషన్ లోకి వెళ్లింది. ఇక లేటెస్ట్ గా మంచు లక్ష్మితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సైతం పాజటివ్ గా తేలింది. రీసెంట్ గా తమన్ దుబాయ్ వెళ్లి మహేష్ బాబును కలిసి వచ్చాడు. ఆయనతో పాటు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. మరి వీళ్లు అక్కడికి తీసుకువెళ్లారా.. అక్కడి నుంచి తెచ్చుకున్నారా అనేది తెలియదు కానీ.. ఇక త్రివిక్రమ్ పరిస్థితి ఏంటనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు హీరో నితిన్ భార్య సైతం కరోనాతో బాధపడుతోంది. నిన్న తన బర్త్ డే సందర్భంగా పాపం తను ఇంట్లో ఒంటరిగా ఉంటే.. కింద నుంచి కేక్ కట్ చేసి తినిపిస్తున్నట్టుగా ఓ వీడియో చేశాడు నితిన్. మొత్తంగా థర్డ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగించింది. ఎన్నో జాగ్రత్తలతో ఉండే సెలబ్రిటీస్ కే తప్పలేదంటే.. ఇక సామాన్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనే సంకేతాలూ వస్తున్నట్టే.

Related Posts