“ఆర్ఆర్ఆర్” వాయిదా. చెన్నైలో చ‌ర‌ణ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ భారీ చిత్రం జ‌న‌వ‌రి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. దాదాపు మూడేళ్ల శ్రమ ఫలితాన్ని వెండితెర పై చూసుకుని ఆనందించాలని వేయికళ్లతో ఎదురుచూసిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి అండ్ టీమ్ తో పాటు సినీ అభిమానులు అంద‌రికీ ఆర్ఆర్ఆర్ వాయిదా షాక్ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు టైమ్ వేస్ట్ కాకుండా ఈ టైమ్ ని స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు ఎన్టీఆర్ అండ్ చ‌ర‌ణ్‌.

ఎన్టీఆర్.. కొర‌టాల శివ‌తో సినిమాను అలాగే బుచ్చిబాబుతో సినిమాను ఒకేసారి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా అదే ప‌నిలో ఉన్నారు. గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో రామ్ చ‌ర‌ణ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ 15వ చిత్రం, దిల్ రాజు 50వ చిత్రం కావ‌డం విశేషం. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చారు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదాపడటంతో వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తనకు చిక్కిన సమయాన్నిశంకర్ సినిమా కోసం కేటాయించడం మొదలుపెట్టారు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతుండటంతో చ‌ర‌ణ్‌ అక్కడకి వెళ్లారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనుల్లో చ‌ర‌ణ్ బిజీగా ఉన్నారు. శంకర్ సినిమా అంటే భారీ సెట్టింగులు…అలాగే భారీ యాక్షన్ బ్లాక్స్ ఓ రేంజ్ లో హైలైట్ అవుతుంటాయి. ఈ సినిమాలో కూడా షాక్ అయ్యే యాక్ష‌న్ సీన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. 2023 సంక్రాంతికి ఈ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయాల‌నేది ప్లాన్.

Related Posts