కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకుంటుంటే… కరోనా థర్డ్ వేవ్ వచ్చి అందర్నీ టెన్షన్ పెడుతుంది. భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి. షూటింగ్ లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన పరిస్థితి. తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నితిన్ భార్య, హీరో విశ్వక్ సేన్కు కరోనా నిర్థారణ అయింది. వీళ్ళు మాత్రమే కాదు.. టాలీవుడ్లో ఇంకా చాలా మంది కరోనా బారిన పడ్డట్లు తెలుస్తుంది.
ఇక కోలీవుడ్ లో కమల్, విక్రమ్, వడివేలు సహా చాలా మందికి కరోనా వచ్చింది. తాజాగా స్టార్ హీరోయిన్ త్రిషకు కూడా కరోనా వచ్చింది. ఇప్పుడు తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కరోనా లక్షణాలు బాగా కనిపించడంతో టెస్ట్ చేయించుకుంటే.. పాజిటివ్గా తేలింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను జనవరి 7 సాయంత్రం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సత్యరాజ్ ఆరోగ్యం పై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని సమాచారం.