ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ల‌ను త‌గ్గించ‌డం గురించి వ‌రుస‌గా ట్వీట్స్ వేయ‌డం.. దీనికి ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని స‌మాధానం చెప్ప‌డం తెలిసిందే. వ‌ర్మ త‌న‌దైన శైలిలో సినిమా టిక్కెట్ల రేట్లు గురించి ట్వీట్స్ చేస్తూ.. మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. వ‌ర్మ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన పేర్ని నాని టిక్కెట్ల విష‌యం చ‌ర్చించేందుకు వ‌ర్మ‌ను ఆహ్వానించారు. ఈ నెల 10న వ‌ర్మ‌తో మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా వ‌ర్మ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ వేశారు. ఏంటంటే.. సినిమా మాదిరిగానే థీమ్ పార్క్ లు, మ్యూజిక్ క‌న్ స‌ర్ట్స్, మ్యాజిక్ షోలు కూడా ఎంట‌ర్ టైన్మెంట్ కింద‌కే వ‌స్తాయి. వీటి ధ‌ర‌ల్ని కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌దు అని వ‌ర్మ ట్వీట్ చేశారు. అయితే.. ఇన్నాళ్లు వ‌ర్మ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఏదో మాట్లాడుతున్నారు అనుకున్న వాళ్లు కూడా ఇండ‌స్ట్రీ గురించి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డాన్ని అంద‌రూ అభినందిస్తున్నారు.

ఇన్నాళ్ల‌కు వ‌ర్మ ఇండ‌స్ట్రీ కోసం ఓ మంచి పని చేస్తున్నారు అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజ‌న్లు. మ‌రి.. ఈ నెల 10న వ‌ర్మ‌, పేర్నిల భేటీలో ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Related Posts