ఆచార్య పోస్ట్ పోన్ అని చెప్పిన రాజశేఖర్

ఆచార్య సినిమా పోస్ట్ పోన్ అయిందని చెబితే కొరటాల శివ లేదంటే నిర్మాణ సంస్థ చెప్పాలి. కానీ మధ్యలో రాజశేఖర్ ఎలా చెబుతాడు అనుకుంటున్నారా..? కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. కొన్ని అప్డేట్స్ మరికొన్ని కొత్త వార్తలకు కారణం అవుతాయి. అలాగే ఇప్పుడు రాజశేఖర్ కొత్త సినిమా శేఖర్ అప్డేట్ ఆచార్య పోస్ట్ పోన్ గుట్టు విప్పింది. తమ సినిమా వాయిదా పడిందని ఇప్పటి వరకూ ఆచార్య టీమ్ నుంచి ఎవరూ చెప్పలేదు. కానీ రాజశేఖర్ నిర్ణయం ఆ విషయాన్ని చెప్పకనే చెప్పింది. మామూలుగా ఆచార్య సినిమా గత దసరా బరిలో విడుదలవుతుంది అనుకున్నారు. బట్ రాలేదు. సంక్రాంతి అనుకుంటే ఆర్ఆర్ఆర్ కోసం ఆగి ఫిబ్రవరి 4న విడుదల అని చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా వాయిదా పడింది కదా. దీంతో ఆచార్య పరిస్థితి ఏంటా అని అంతా అనుకుంటుండగానే ఈ కొత్త వార్త ఆ సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పింది. అది రాజశేఖర్ ద్వారా బయటకు రావడమే విశేషం.
యాంగ్రమేన్ రాజశేఖర్ కొత్త సినిమా శేఖర్. మళయాల సూపర్ హిట్ జోసెఫ్ చిత్రానికి రీమేక్ గా వస్తోన్న మూవీ ఇది. జీవిత రాజశేఖర్ దర్శకురాలు. శేఖర్ ను సంక్రాంతి బరిలో విడుదల చేస్తారు అనే రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు వాటిని టెంప్ట్ కాలేదు. ఆ మధ్య ఓ మంచి పాటను కూడా విడుదల చేసిన టీమ్ లేటెస్ట్ గా తమ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆచార్య రిలీజ్ డేట్ రోజున అన్నమాట. మరి ఆచార్య లాంటి సినిమాకు పోటీగా శేఖర్ వస్తుందనుకుంటామా..? సో.. మెగాస్టార్ వెనక్కి వెళ్లాడు కాబట్టే యాంగ్రీమేన్ ముందుకు వచ్చాడు. తమ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు చెప్పారు. మొత్తంగా థర్డ్ వేవ్ తాకిడి స్ట్రాంగ్ గానే ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Related Posts