బాలకృష్ణను ఊహించని ప్రశ్న అడిగిన రాజమౌళి

బాలకృష్ణ .. వెండితెరపై ఎలా ఉన్నా.. రియల్ లైఫ్ లో మాత్రం ఆయనంటే చాలామంది భయపడతారు. తన పరిధిలో చిన్న మిస్టేక్ జరిగినా.. తను ఎక్కడ ఉన్నాడు.. ఎదురుగా ఉన్నది ఎవరు అని కూడా చేయి చేసుకుంటాడు. పైగా ఈ విషయాలను సమర్థించుకుంటాడు కూడా. అటు ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటుడు చేయి తగిలిందని ఆనందిస్తున్నాం అని చెప్పుకుంటారు అంటారు. అయితే ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణతో చేయిస్తోన్న ‘అన్ స్టాపబుల్’షో వల్ల చాలామంది అసలు బాలయ్య అంటే ఏంటో అర్థం అవుతోంది. తనలో ఓ సీరియస్ మేన్ మాత్రమే కాదు.. ఓ జోవియల్ పర్సన్ కూడా ఉన్నాడని చాలామందికి అర్థమవుతోంది. ఒక్కోసారి ఆయనలో చిన్న పిల్లాడిని కూడా చూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఆహా ప్లాట్ ఫామ్ లో సూపర్ సక్సెస్ అయిన ఫస్ట్ గెస్ట్ షో అన్ స్టాపబుల్ కావడం విశేషం. అందుకు ప్రధాన కారణం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ షోను బాలయ్య ఓన్ చేసుకున్న విధానమే అంటే కాదనలేం.
ఇక బాలయ్య ఎవర్నైనా ఏదైనా అడుగుతాడు. మరి బాలయ్యను కూడా అలా ఎవరైనా ధైర్యంగా అడగగలరా..? అంటే అడగగలను అంటూ ముందుకు వచ్చాడు రాజమౌళి.
ఈ వారం అన్ స్టాపబుల్ గెస్ట్స్ గా రాజమౌళి, కీరవాణి వచ్చారు. ఈ షోలో చాలా విషయాలే పంచుకున్నట్టు ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఈ ప్రోమోలోనే రాజమౌళి .. బాలయ్యను ఊహించని ప్రశ్న అడిగాడు. ‘మీకు కోపం వస్తే ఆగరు. ఎదుటి మనిషి ఎవరు ఏంటీ అని చూడకుండా.. నోటికి ఎంత మాటొస్తే.. అంత మాటే తిట్టేస్తారు..’ అని అడిగాడు రాజమౌళి. మరి దీనికి బాలయ్య ఆన్సర్ ఏంటనేది షో చూస్తేనే తెలుస్తుంది. అయితే ఆ ప్రశ్న తర్వాత బాలయ్య మరో ఆన్సర్ చెప్పాడు. ‘చేతిలో ఫోన్ తీసి కొట్టా.. ఐమ్ నాట్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్పా’అన్నాడు. దీనికి రాజమౌళి మీరు చేస్తుంది తప్పు అన్నాడు. దానికి బాలయ్య.. అలా అయితే నేను బాలకృష్ణ కాదు అని రిప్లై ఇవ్వడం విశేషం.
మొత్తంగా బాలయ్య ఇతరులను కొట్టడం అనే విషయం ఇప్పటి వరకూ ఎవరూ ఆయన్నే నేరుగా అడిగింది లేదు. మరి రాజమౌళి క్వశ్చన్ కు బాలయ్య ఏం ఆన్సర్ చెబుతాడో కూడా సులువుగానే ఊహించొచ్చేమో కదా…?

Related Posts