ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో పుష్ప సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊహించని విధంగా పుష్ప వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక నార్త్ లో ఏకంగా 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ సినీ పండితులకు సైతం షాక్ ఇచ్చిందని చెప్పచ్చు.
పుష్ప సినిమా కారణంగా డైరెక్టర్ సుకుమార్ పేరు నార్త్లో మారుమోగిపోతోంది. దీంతో చాలా మంది నార్త్ మేకర్స్ సుకుమార్ గత చిత్రాలపై కన్నేశారు. అందులో భాగంగా గోల్డ్ మైన్స్ అనే సంస్థ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేయడానికి రెడీ అయింది.
ఈ నెల 26న బన్నీ అల వైకుంఠపురములో.. చిత్రం హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతోంది ఇదే సంస్థ.