“రాధే శ్యామ్” ట్రైల‌ర్ గురించి ప్ర‌శాంత్ నీల్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ భారీ పిరియాడిక్ మూవీ రాధేశ్యామ్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. విజువ‌ల్ వండ‌ర్ అనేలా ఈ ట్రైల‌ర్ ఉంది. ఇలా రిలీజ్ చేశారో లేదో.. అలా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు రాధేశ్యామ్ ట్రైల‌ర్ అదిరింది అంటూ త‌మ స్పంద‌న‌ను సోష‌ల్ మీడియా ద్వారా తెలిచేస్తున్నారు.

ఇక కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కూడా రాధేశ్యామ్ గురించి త‌న స్పంద‌న‌ను తెలియ‌చేశాడు. ఇంత‌కీ ప్ర‌శాంత్ నీల్ ఏమ‌న్నారంటే.. రాధే శ్యామ్ ట్రైలర్ ఫ‌స్ట్ నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా అమేజింగ్ విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. సినిమా ప్రతి సెకండ్ కూడా ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తుంది. ప్రభాస్ సర్ తో పాటు దర్శకుడు రాధా కృష్ణ మొత్తం టీంకి కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ టు ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ అండ్ యు.వి.క్రియేష‌న్స్ అని తెలిపారు.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ భారీ సినిమా వచ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి కానుక‌గా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Related Posts