నట సింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తదుపరి చిత్రాన్ని బాలయ్య.. క్రాక్ సినిమాతో సక్సస్ సాధించిన మలినేని గోపీచంద్ తో చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్ గా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. పూజా కార్యక్రమాలతో ఆమధ్య ఈ సినిమాను ప్రారంభించించారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ఆరంభించనున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్రను కన్నడ యాక్టర్ దునియా విజయ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు మరొక సెన్సేషన్ అప్ డేట్ తో చిత్ర యూనిట్ ముందుకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ కోసం పవర్ ఫుల్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. మలినేని గోపీచంద్ తెరకెక్కించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మరో పవర్ ఫుల్ రోల్ చేస్తుండడం విశేషం.
కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి.. ఈ సినిమాతో బాలయ్య, గోపీచంద్ మలినేని ఏ స్థాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.