యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. బాహుబలితో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్.. బాలీవుడ్ లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్నో సార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. కరోనా థర్డ్ వేవ్ వచ్చి మళ్లీ ఆర్ఆర్ఆర్ కు అడ్డంపడింది.
అయితే.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్తో పాటు రాజమౌళి పాల్గొన్నారు. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా దాదాపు చాలా కార్యక్రమాలకు హాజర్ అయ్యింది. ఈ ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దాదాపుగా ఈ సినిమా కోసం ఇప్పటి వరకు నిర్మాతలు 18 నుంచి రూ.20 కోట్లు వరకు ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ బడ్జెట్తో ఓ చిన్న సినిమాని తీసి రిలీజ్ చేయవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా కాబట్టి ఆమాత్రం ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయాలి. అయితే.. ఇంత ఖర్చు చేసినా సినిమా వాయిదా పడింది. దీంతో ఇప్పుడు సినిమా రిలీజ్ టైమ్ లో మళ్లీ ప్రమోషన్స్ చేయాలి. ఆడియన్స్ ని ఆకట్టుకోవాలి. ఇదంతా చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అందుచేత ఇప్పటి వరకు ప్రమోషన్స్ కోసం ఖర్చు పెట్టింది అంతా వేస్ట్ అయినట్టే.