కొనసాగుతోన్న బాలీవుడ్ కష్టాలు.. పండగ చేసుకుంటోన్న సౌత్ సినిమాలు

పోటీ లేని ఏ పరిశ్రమైనా పెద్దగా రాణించదు. అయితే పరిశ్రమల మధ్యే పోటీ అనేది ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం ప్యాన్ ఇండియన్ సినిమాలు. ఈ టైమ్ లో ఈ మాట మొదలైందోకానీ.. అప్పటి నుంచీ సౌత్ సినిమాలు సత్తా చాటుతోంటే బాలీవుడ్ బాక్సాఫీస్ పూర్తిగా డల్ అయిపోయింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. అక్కడ మినిమం కలెక్షన్స్ సాధించడం లేదు. ఈ టైమ్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన రణ్ వీర్ సింగ్ సినిమా కూడా అదే రూట్ లోకి ఎంటర్ అయ్యి బాలీవుడ్ కు మరో షాక్ ఇచ్చింది..

జయేష్ భాయ్ జోర్దార్.. రణ్ వీర్ సింగ్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే జంటగా నటించిన సినిమా. బొమన్ ఇరానీ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశాడు. దివ్యాంగ్ థక్కర్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీకి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో గాళ్ చైల్డ్ ను తక్కువగా చూసే నేపథ్యంలో అల్లుకున్న కథగా ఇదో సెన్సిబుల్ మూవీ అవుతుందనే టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు రణ్ వీర్ సింగ్ గెటప్ అద్భుతంగా కుదరడంతో సినిమా గ్యారెంటీ బాలీవుడ్ కు ఓ బజ్ తెస్తుందని భావించారు అందరూ. బట్ ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన రివ్యూస్ తెచ్చుకుని బాలీవుడ్ కు మరో షాక్ ఇచ్చింది.

బాలీవుడ్ కొన్నాళ్లుగా మినిమం ఓపెనింగ్స్ కూడా లేకుండా ఇబ్బంది పడుతోంది. రణ్ వీర్ సింగ్ కు ఓ రేంజ్ ఉంది కాబట్టి.. అతనికైనా ఓపెనింగ్స్ వస్తాయనుకున్నారు. ఈ విషయంలో కాస్త ఫర్వాలేదనిపించినా.. ఫస్ట్ షో అయిపోగానే డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. దీంతో మధ్యాహ్నానికే కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. తీసుకున్న కంటెంట్ బానే ఉన్నా.. ప్రెజెంటేషన్ వరస్ట్ గా ఉందని ప్రతి రివ్యూలోనూ కనిపిస్తోంది. ఇక బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అయితే ఈ సినిమాకు కేవలం ఒకటిన్న రేటింగ్ ఇచ్చి ‘పూర్’ అనే ఒకే పదంతో తేల్చేశాడంటే సినిమా ఎలా ఉందో అర్థం కావడం లేదూ..? ఇక సందట్లో సడేమియా అన్నట్టుగా అక్కడే చాలామంది ఈ వారం కూడా కెజీఎఫ్2 దే అని కమెంట్స్ చేస్తుండటం విశేషం. మరి బాలీవుడ్ కు ఈ కష్టాలు ఇంకెన్నాళ్లో చూడాలి.

Related Posts