వచ్చే వారంలోనే ఎన్టీఆర్, కొరటాల సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు లైన్ లోకి వస్తున్నాడు. 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు ఎన్టీఆర్. తర్వాత చేసిన ఆర్ఆర్ఆర్ కోసం ఇన్నాళ్లూ వెయిట్ చేశాడు. గతంలో త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ అయినా అది ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే కొరటాల శివతో సినిమాను ప్రకటించారు. ఇది చాలామంది అప్పటికి ఊహించలేదు. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకే ఈ అనౌన్స్ మెంట్ వచ్చింది. బట్ ఇద్దరికీ నచ్చేలా ప్రాపర్ కథ ఆ ప్రకటన టైమ్ కు లేదు. ఇటు కొరటాల ఆచార్య మూవీతో లాక్ అయ్యి ఉన్నాడు. ఏమైతేనేం.. ఆచార్యకు సంబంధించి అన్నీ ‘వదిలించుకుని’ఫైనల్ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ చేతిలో పెట్టాడు. ఆ తర్వాతే ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన కథపై కూర్చున్నాడట. మొదట్లో ఎన్టీఆర్ కు చెప్పిన లైన్ కు తగ్గట్టుగా కథ రాలేదు. దీంతో మరింత టైమ్ కథకే తీసుకున్నాడు. ఇటు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆషామాషీ కథ చేస్తే వచ్చే ప్యాన్ ఇండియన్ ఇమేజ్ పోతుంది. అందుకే ఆ స్థాయి ప్రేక్షకులను మెప్పించే కథకే ఓకే చెప్పాలనుకున్నాడు.
మరి ఫైనల్ గా అలాంటి కథే ఫైనల్ అయినట్టుంది. ఇక పట్టాలెక్కించబోతున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ఓపెనింగ్ జరగబోతోంది. ఈ ఓపెనింగ్ కు రాజమౌళితో పాటు ఇతర సినీ పెద్దలు చాలామంది హాజరవుతారని సమాచారం. ఓపెనింగ్ కూడా నేషనల్ వైడ్ ఆడియన్సెస్ ను ఆకట్టుకునేలా జరపాలని ప్లాన్ చేశారట. అంటే ఈ మూవీ స్టిల్స్ అన్ని నేషనల్ మీడియాస్ లోనూ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారని టాక్.
ఇక ఈ మూవీలో అంతా ఊహించినట్టుగానే అలియాభట్ ను హీరోయిన్ గా తీసుకున్నారు అంటున్నారు. కానీ ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. ఈ విషయంలో ఓపెనింగ్ రోజు తెలుస్తుంది. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ను కూడా అదే రోజు ప్రకటిస్తారంటున్నారు. ఓపెనింగ్ తర్వాత మళ్లీ రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది కూడా అదే రోజు చెబుతార్ట. మొత్తంగా ఎన్టీఆర్ మళ్లీ లైన్ లో పడుతున్నాడన్నమాట.

Related Posts